‘పట్నం’ కోసం నేడు మంత్రివర్గ విస్తరణ..?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అనేక సర్దుబాట్లు, వడబోతల తర్వాత ఈ లిస్టును తయారు చేశామంటూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. ‘తాండూరులో కూడా పట్నం మహేందర్‌ రెడ్డి… రోహిత్‌ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. అందువల్ల మహేందర్‌రెడ్డికి ఏం చేస్తమో.. మీరు త్వరలోనే చూస్తరుగదా…’ అంటూ ఆయన సోమవారం వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అన్నట్టుగానే ఆయనకు పెద్ద పదవినే కేసీఆర్‌ కట్టబెట్టబోతున్నారు. ఈటల రాజేందర్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన క్రమంలో ఖాళీ అయిన క్యాబినెట్‌ బెర్తును పట్నం మహేందర్‌రెడ్డితో భర్తీ చేయబోతున్నారు. ఇందుకోసం మంగళవారం ప్రత్యేకంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పని చేసిన మహేందర్‌రెడ్డి… 2018లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రోహిత్‌రెడ్డి… ఆ తర్వాత గులాబీ గూటికి చేరిపోయారు.

Spread the love