విలక్షణ సినిమాలకు కేరాఫ్‌ వి మెగా పిక్చర్స్‌

ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ దక్కించు కున్నారు కథానాయకుడు రామ్‌ చరణ్‌. ఆయన యువీ క్రియేషన్స్‌లోని తన స్నేహితుడు విక్రమ్‌ రెడ్డితో కలిసి సినిమాలు నిర్మించబోతున్నారు. కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలను, యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్‌’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్‌ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ
రూపొందించనుంది. అలాగే యువ ప్రతిభను ఎంకరేజ్‌ చేసేందుకు ఈ బ్యానర్‌ వేదికగా మారనుంది.
ఈ సందర్బంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ, ”మా ‘వి మెగా పిక్చర్స్‌’ బ్యానర్‌ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండిస్టీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండిస్టీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.
యువీ క్రియేషన్స్‌ విక్రమ్‌ మాట్లాడుతూ, ‘ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి ”వి మెగా పిక్చర్స్‌” పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండిస్టీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం’ అని చెప్పారు.

Spread the love