ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చిలకమర్రి నరసింహను నియమించాలి

నవతెలంగాణ- బోధన్ టౌన్ 

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కమిషన్ మాజీ చిలకమర్రి నరసింహ ను నియమించాలని బోధన్ నియోజకవర్గ లంబాడ హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు దియావత్ సంతోష్ కుమార్ బోధన్ పట్టణంలోని ఈ సందర్బంగా పత్రిక గురువారం ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
గత కొన్ని సంవత్సరాలనుండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా దళితుల, గిరిజనులకు సమస్య వస్తె వెంటనే స్పందించి ఈ వర్గాలకు న్యాయం జరిగేలా చూసారని ఈ సందర్బంగా సంతోష్ కుమార్ గుర్తు చేశారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చిలకమర్రి నరసింహ ను నియమిస్తేనే దళిత గిరిజన జాతులకు న్యాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. కావున అతి త్వరలో నియమించబోయే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా చిలకమర్రి నరసింహ నియమించాలని ఈ సందర్బంగా సంతోష్ కుమార్ కోరారు.
Spread the love