– హాజరుకానున్న బీవీ.రాఘవులు, తపన్ సేన్
– వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు మహా ప్రదర్శన, బహిరంగ సభ
-వెల్లడించిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
సీఐటీయూ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు హన్మకొండలోని బాలవికాస్లో నిర్వహించ నున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. మంగళవారం హన్మ కొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో నిర్వహి ంచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటిసారి పోరాటాల గడ్డ హన్మకొండలో మొదటి సారి నిర్వహిస్తున్న జాతీయ వర్కింగ్ కమిటీ సమావే శాలను జిల్లా కార్మికవర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
గడిచిన పదేండ్లలో బీజేపీ అవలం బించిన విధానాలపై సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతుం దని, చేద్దామంటే పని దొరకడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా ప్రభుత్వ రంగం మొత్తం ధ్వంసమైందని విమర్శించారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన బీజేపీ.. సంఫ్ు పరివార్ సహకారంతో గడిచిన పదేండ్లలో విద్వేష, మత రాజకీయాలను ప్రేరేపిస్తుండటంతో దేశ ప్రగతి అన్ని రంగాల్లో తిరోగమిస్తుందన్నారు. విదేశీ, స్వదేశీ, బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం కార్మికుల ను కట్టుబానిసలుగా మారుస్తూ 8 గంటల పని విధానానికి మంగళం పాడి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు చేస్తుంటే ప్రధాని మాత్రం పెట్టుబడి దారులకు అనుగుణంగా ఒకరోజు ఫ్లోర్ లెవెల్ వేతనం రూ.178లుగా నిర్ణయించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికవర్గం, దేశ ప్రజానీకం అనుసరించాల్సిన ఎత్తుగడలను ఈ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిపారు. వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా జనవరి 31న వేలాది మందితో కార్మిక మహా ప్రదర్శన, పబ్లిక్ గార్డెన్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు, సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ హాజరవుతున్నారన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, రాగుల రమేష్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు టి.ఉప్పలయ్య, కాసు మాధవి, గాదె ప్రభాకర్ రెడ్డి, మెట్టు రవి, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ బొట్ల చక్రపాణి, వేల్పుల సారంగపాణి, పుల్ల అశోక్, ఎన్.రజిత తదితరులు పాల్గొన్నారు.