న్యూఢిల్లీ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతోపాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా విడుదల చేశారు. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో 14,624 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. సీరియల్ నంబర్లు, రోల్ నంబర్లు, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా యుపిఎస్సి వెబ్సైట్లో ఉంచింది. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారం-1 (డిఎఎఫ్-1)లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సి తెలిపింది. దీనికి సంబంధించిన గడువు తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రిలిమ్స్ అభ్యర్థులు తమ ఫలితాలను బజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్ సైట్లో చూసుకోవచ్చు. ‘మార్క్స్, కటాఫ్ మార్కులు, ప్రిలిమ్స్ 2023 ఆన్సర్ కీ వంటి వాటిని పరీక్షల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తరువాత వెల్లడిస్తామని తెలిపింది.