కాంగ్రెస్ కార్నర్ సమావేశం విజయవంతం చేయాలి

– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో రేపు మంగళవారం సాయంత్రం కార్నర్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశాన్ని మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర  యువ నాయకుదు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు అధ్యక్షతన మండల కాంగ్రెస్ కార్నర్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ హాజరవుతున్నారని తెలిపారు. కావున మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు, కాంగ్రెస్  అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Spread the love