ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి

నవతెలంగాణ-భూధాన్‌పోచంపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో లక్ష మంది బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల పార్టీ కార్యదర్శి గోడల భూషణ్‌, నరసింహ రాములు, సురకంటి సాయి రెడ్డి మిరియాల కృష్ణమూర్తి‌, వడ్డేపల్లి యాదగిరి, బాల నరసింహ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love