తాడ్వాయి లో నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్

– మాజీ సర్పంచ్ సునీల్ దొర
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం నేటినుంచి ఎం పి ఎల్ -2 ముత్యాలమ్మ కప్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు, ట్రెండ్ యూత్ తాడ్వాయి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, గ్రామ పెద్దలు ఊకె రామయ్య లు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో 42 జట్లు పాల్గొనబోతున్నట్లు తెలిపారు. డ్రా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, జాతీయభావానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడలను అందరు చదివిన చేసుకోవాలని అన్నారు. విజేతలకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బంగారి రమేష్, తాటి రామచందర్, బంగారి సురేష్, ట్రేండ్ యూత్ అధ్యక్షులు మోకాళ్ళ బాలాజీ, ప్రధాన కార్యదర్శి మోకాళ్ళ వెంకటేష్, బంగారి అజయ్ మట్టం అజయ్ మోకాళ్ళ శీను సూర్య సీనియర్ క్రీడాకారులు మోకాల స్వామి, తాటి నరేష్, తరుణ్, ఉదయ్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
Spread the love