– మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీని ఓడించాలి
– సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు సీపీఐ(ఎం) నగర కమిటీ మద్దతు తెలిపింది. గత పదేళ్లు దేశాన్ని పాలించిన బీజేపీ ప్రజా వ్యతిరేకంగాను, మతవిద్వేషాలను రెచ్చగొడుతూ నిరంకుశ పాల న కొనసాగిస్తోందని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరా బాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ 10ఏండ్లు అధికారంలోవున్న బీజేపీ చేసిందేమీలేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్కు సీపీఐ (ఏం) నగర కమిటీ మద్దతు తెలుపుతుంద న్నారు. దానం గెలుపు కోసం సీపీఐ(ఏం) కార్యకర్తలు శాయశక్తుల కృషి చేస్తారన్నారు. నగరంలో మత విద్వేషాలను సృష్టిస్తున్న బీజేపీని ఓడించి, సెక్యులర్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.