మండలంలోని అన్ని గ్రామాలను మౌళికంగా ఆభివృద్ది చేయడమే కాంగ్రేస్ పార్టీ నాయకుల ముఖ్య ఉద్దేశం అని జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు సంజీవ్ పటేల్ అన్నారు. గురువారం నాడు మండలంలోని ఖండేబల్లూర్ గ్రామములో ఉపాదీహమీ పథకంలో బాగంగా రూపాయలు ఐదులక్షల వ్యయం తో జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ సహకారంతో సిసి రోడు పనులను మండల పార్టీ అద్యక్షుడు సంజీవ్ పటేల్ ప్రారంబించారు. ఈ సంధర్భంగా పార్టీ అద్యక్షుడు సంజీవ్ పటేల్ మాట్లాడుతు ఎమ్మెలే సహకారంతో గ్రామాలలో మంచి ప్రతిష్టను కొనసాగిస్తామని పేర్కోన్నారు. కార్యక్రమంలో జుక్కల్ మండల మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్ మండల పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్, నాయకులు లక్షెట్టి సాయులు, కృష్ణ, రాజేందర్ సింగ్ తదితరులు పాల్గోన్నారు.