నిరుపేద వధువుకు పుస్తె మెట్టెలు పంపిణీ

నవతెలంగాణ – రాయపోల్ 
నిరుపేద వధువు వివాహానికి మానవతా దృక్పథంతో పుస్తే మట్టెల పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు రాంసాగర్ బిఆర్ఎస్ నాయకులు కొండారి గణేష్, బాగున్నగారి సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నాగేందర్, నరేష్ గౌడ్. గురువారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో వధువు వడ్ల మానసకు పుస్తె మట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంసాగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం వడ్ల వరమ్మ తన కూతురు వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుందని మా దృష్టికి రాగానే ఆ నిరుపేద కుటుంబానికి మా వంతు సహకారంగా నిలవాలని వడ్ల వరం మా కూతురు మానస వివాహానికి పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందన్నారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించిన కలగని సంతోషం నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. కష్టాలలో ఉన్న వారికి మానవత్వంతో మన వంతు సహాయం చేద్దామని పేర్కొన్నారు.
Spread the love