రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో, హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి బ్యాక్డ్రాప్లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ‘డీజే పిల్లా..’ పాటను విడుదల చేశారు. ”నా దిల్లే నీ వల్లే టూరింగు టాకీసులా మారెనే, నా కల్లో నీ బొమ్మనే..’ అంటూ సాగే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా, వైషాగ్ పాటను పాడారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ”మా ‘శశివదనే’ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్తో సినిమా తెరకెక్కింది. మంచి లవ్ మూవీ చూడాలనుకునే వారి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నాం. మా హీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ తమ పాత్రల్లో అలా ఒదిగి పోయారంతే’ అని అన్నారు.