అమ్మ జన్మనిస్తే పునర్జన్మ డాక్టర్లు ఇస్తారు..

– మన అందరి నిర్లక్ష్యం వల్ల 30 పడకల ఆసుపత్రి 15 పడకలకు వచ్చింది
– అడుగులో అడుగు వేద్దాం కావలసినవి సాధించుకుందాం
– విలేకరుల సమావేశంలో బాలు యాదవ్
నవతెలంగాణ- మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ఎన్నో ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ,ప్రతి ఒక్క గ్రామం మండలం జిల్లా మొత్తం తెలంగాణ బాగుండాలని ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నాం అయితే ఈ దశాబ్ద కాలంలో మన మద్నూర్ మండలానికి ఏమి వచ్చాయి, ప్రజలారా మేల్కడి మిమ్మల్ని సూటిగా అందరిని అడుగుతున్నాను. అయితే మనం చూసుకున్నట్లయితే ఏమి రాలేదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా ఇలా మనం మౌనంగా ఉంటే 15 పడకల ఆసుపత్రి కూడా ఉండదు జనాలు చికిత్స అందక చనిపోవాల్సి పరిస్తితి కి వస్తుంది. ఇకనైనా జరగ బోయే నష్టాన్ని నివారణకు మనం, ముందు జాగ్రత్తగా మన ఊరు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మద్నూర్ మండలానికి చెందిన ప్రతి ఒక్క మనిషి ఆసుపత్రి కోసం పోరాడాలని పిలుపునిస్తున్నాం. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు అలాగే మనం ప్రశ్నించకపోతే ఏ ఒక్కడు ముందుకు రారు దయచేసి ప్రశ్నిద్దాం భవిష్యత్తు తరాలు బాగుండాలని వాళ్లకోసం మనం పోరాడుదాం. అందరూ స్వార్థం విడి అందరిదీ అనుకోకుండా నాది అని అనుకోని రండి అడుగులో అడుగు వేద్దాం మనకు రావాల్సిన కావాల్సిన తెచ్చుకుందాం. ఈ కార్యక్రమంలో బాలు యాదవ్. మరియు మద్నూర్ యువకులు నవీన్ యాదవ్ విఠల్ యాదవ్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love