లోక్ సభ ఎన్నికల  జిల్లాలో డైనమిక్ తనిఖీలు..

– యాబై వెల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లారు సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలి
నవతెలంగాణ – వేములవాడ : లోక్ సభ ఎన్నికలలో భాగంగా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద నాకబంధి ఏర్పాటు చేశారు. శుక్రవారం వాహన తనిఖీల్లో  సిబ్బందితో కలసి వాహనాల తనిఖీని  ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి, అధికారులకి సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం, నగదు, మాధకద్రవ్యలు , ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిల్లా సరిహద్దుల్లో ,పట్టణాల్లో, మండల కేంద్రాల్లో డైనమిక్ తనిఖీలు, నకబంది ఏర్పాటు చేసి వాహనాలను  క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.సీజ్ చేసిన నగదుకు సంబంధించి సరైన ధ్రువ పత్రలు చూపించగా గ్రీవెన్స్ కమిటీకి రెండు రోజుల్లో రిలీస్ చేయడం జరుగుతుందన్నారు.ప్రజలకు విజ్ఞప్తి ఐబై వెలకంటే ఎక్కువ నగదు తీసుకవేళ్ళేవారు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని డిఎస్పీ నాగేంద్రచరి, ఆర్డీవో రాజేశ్వర్,  ఎమ్మార్వో మహేష్ తో కలసి  పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎస్పీ  వెంట డిఎస్పీ నాగేంద్రాచారి, పట్టణ సి.ఐ వీరప్రసాద్, ఎస్.ఐ అంజయ్య, గోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్.ఐ దిలీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love