కుక్కల దాడిలో దూడ మృతి

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని తడగాం కాలనీకి చెందిన పాడి రైతు బాలగంగాధర్ పుట్టంలో గురువారం అర్ధరాత్రి రెండు దూడలపై కుక్కలు దాడి చేయడంతో ఒక దూడ మృతి చెందగా మరో దూడకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన దూడకు పశు వైద్యులు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. పాడి రైతుకు సుమారు 20వేల నష్టం జరిగినట్లు తెలిపారు.మండల కేంద్రంలో కుక్కల బెడిద తీవ్రం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

Spread the love