ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు సజీవ దహనం

నవతెలంగాణ-హైదరాబాద్ : రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది కారు. దీంతో ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగాయి మంటలు. ఇక ఈ మంటల్లో పూర్తిగా దగ్దమైంది కారు. ఇక ఈ కారులో ఒకరు సజీవ దహనం అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే… మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ORR రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అటు కారు పూర్తిగా దగ్దమైంది. కారు నెంబర్ ను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Spread the love