బస్సు ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు మృతి 

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
బస్సు ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై మండలంలోని మాటేడు గ్రామ శివారు వద్ద శనివారం చోటు చేసుకుంది చిన్న గూడూరు మండలం గుండం రాజు పెళ్లికి చెందిన తండ్రి కొడుకులు జక్కుల హరీష్ 35 అతని కుమారుడు జక్కుల తేజ 5 బాలుడు ఇద్దరు కలిసి పల్సర్ బైక్ పై తొర్రూర్ నుండి దంతాల పళ్లి వైపు వెళ్తుండగా మాటేడు శివారు ఉదయ పూర్వక హోటల్ ముందు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు అని పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Spread the love