అగ్నిమాపక వారోత్సవాలు.. అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – కంటేశ్వర్
అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ స్టాప్ అండ్ ఆల్ డాక్టర్స్, సెక్యూరిటీ సిబ్బంది అందరూ హాజరై యొక్క ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంను అందరూ హాజరై విజయవంతం చేయడం అలాగే అగ్ని ప్రమాదాల వల్ల ఎలా నివారించుకోవాలో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వివరించారు. అలాగే ఇంట్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి వాటిని ఏ విధంగా ఆర్పాల్లో క్షుణ్ణంగా వారికి చూయిస్తూ ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి పి. నర్సింగ్ రావు అగ్నిమాపక  సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Spread the love