డీకే శివకుమార్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.  ప్రస్తుతం వీరీద్దరూ భేటీ కావడం సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది.

Spread the love