భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: గిన్నారపు మహేందర్

నవతెలంగాణ – ధర్మసాగర్
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కార్మిక రత్న అవార్డు గ్రహీత జిన్నారపు మహేందర్ అన్నారు.మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలి ఇచ్చి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వెల్ఫేర్ బోర్డు కి ఇప్పటివరకు చెర్మైన్ ను నియమించలేదని, వెల్పర్ బోర్డుకు మా కార్మికుడినే చైర్మన్ గా నియమించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం అర కొర పథకాలతో మా పొట్టకొట్టిందన్నారు. మాకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్మిక పక్షాన గత ప్రభుత్వం లో వున్న సంక్షేమ పథకాలను రెండింతలు చేయాలని గుర్తు చేశారు.55సం లకే పెన్షన్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రచార కార్యదర్శి నల్ల స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు గిన్నారపు,రేణునుమల్ల శ్యామ్,దుప్పటి సాంబయ్య,మల్లంపల్లి ఎంపీటీసీ బింరెడ్డి కరుణాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ సింగారపు రమేష్,మాజీ సర్పంచ్ నరబోయిన ఎల్లాస్వామి,ముఖ్య నాయకులు గిన్నారపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love