- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మద్నూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, సభ్యులు మంగళవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు. రాష్ట్ర రాజధాని లోని ట్యాంక్బండ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి కార్య క్రమానికి హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ జయంతి కార్యక్రమంలో పాల్గొంటామని సంఘం నాయకులు తెలిపారు. తరలి వెళ్లిన వారిలో నాగేష్ గౌడ్, సుభాష్ గౌడ్, సుమంత్ గౌడ్, తదితరులున్నారు.
- Advertisement -



