యోగా ను అలవాటు చేసుకుంటే అనారోగ్యాలు దరి చేరవు: గోవర్ధన రెడ్డి

నవతెలంగాణ- చైతన్యపురి
యోగా ను అలవాటు చేసుకుంటే అనారోగ్యాలు దరి చేరవని శ్రీ త్రివేణి సంస్థ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీ త్రివేణీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలుః అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన ఆసనాలను ప్రదర్శించారు. అందరినీ ఆకట్టుకునే విధంగా సూర్యనమస్కారాలను ప్రదర్శించారు. డైరెక్టరు  గోవర్ధన రెడ్డి యోగా ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేస్తూ యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవనీ, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చనీ, ఆరోగ్యం మన సొంతమని తెలియజేశారు. పాఠశాలలో తప్పకుండా యోగా క్లాసులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీల్, యెగేశ్వరీ, టీచర్లు, విద్యార్థులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love