- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని బాల్కొండ మండల పరిధిలో మంగళవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంఘం సభ్యులు అమర్నాథ్ గౌడ్, బాల గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కమల్ గౌడ్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



