శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం కేటుగాళ్లు శంషాబాద్ విమానాశ్రయంలో సినీ ఫక్కీలో కిలోన్నర కు పైగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్  శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చిన కేరళ ప్రయాణికుడు బంగారాన్ని పొడిగా తయారుచేసి తరలిస్థూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న కస్టమ్స్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1761 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు‌. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితున్ని విచారణ చేపట్టారు. దుబాయ్ నుంచి తరలించే ముందు అక్కడ ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందని ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు వున్నారు? హైదరాబాద్‌ లో వున్న వ్యక్తులు ఎవరితో నిందితుడు కాంటాక్ట్‌ లో వున్నాడో దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love