హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ ఏయూఎంలో భారీ వృద్ధి

ముంబయి : హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)లో 2023 మే 15 నాటికి రూ.50,000 కోట్ల అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎయుఎం) నిధుల మార్క్‌ను చేరినట్టు ప్రకటించింది. 2020లో రూ.10వేల కోట్ల ఆస్తులు ఉండగా.. 33 నెలల్లోనే 400 శాతం వృద్థిని సాధించినట్టు పేర్కొంది. ”ఇది మాకు చాలా గర్వకారణమైన సమయం. రూ.50,000 కోట్లు ఎయుఎం మైలురాయిని దాటినందుకు సంతోషిస్తున్నాము. ఈ ఏడాది పదేళ్లు వ్యాపారాన్ని పూర్తి చేసుకునే సమయంలో ఈ విజయం మరింత ముఖ్యమైంది.” అని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ సంస్థ సీఈఓ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు.

Spread the love