మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకొని సీఎం రేవంత్  రెడ్డి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ లో  రాజేంద్రనగర్‌‌  సర్కిల్‌‌ అత్తాపూర్‌‌ డివిజన్‌‌ హైదర్‌‌గూడ చౌరస్తాలో గురువారం నిర్వహించిన రోడ్‌‌ షోలో ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి పాల్గొన్నారు. రోడ్‌‌ షోలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో రేవంత్‌‌ తన కాన్వాయ్‌‌లో ఉండే అంబులెన్స్‌‌ను పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న జనాన్ని పక్కకు తప్పుకొని అంబులెన్స్‌‌కు దారి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love