రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌ లైన్‌ క్విజ్‌ పోటీలను విజయవంతం చేయాలి

పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ డెస్క్‌
దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో రాజీవ్‌ గాంధీ యూత్‌ ఆన్‌ లైన్‌ క్విజ్‌ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిసిసి అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్న సందర్భంలో నేనున్నానని భరోసా కల్పిస్తూ ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ లో జరిగిన సమావేశంలో యూత్‌ డిక్లరేషన్‌ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. జూన్‌ 18న ఆన్‌ లైన్‌ క్విజ్‌ పోటీ పరీక్షలు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఆన్‌ లైన్‌ క్విజ్‌ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో దోమ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రామచంద్ర రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు మాలి విజరు కుమార్‌ రెడ్డి, మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love