ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రేస్ లో భారీ చేరికలు

Oplus_131072

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం నుండి గ్రామ అధ్యక్షులు గంగా రెడ్డి,అనిత సింగ్,పాకాల వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల హనుమన్లు,ఎంపీటీసీ ఉమాకాంత్, హన్మగౌడ్, బలరాం సార్ మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు యువకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బుదువారం నాడు చేరడం  జరిగింది. జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిలు గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మేల్యే  వీరందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఈ చేరికలు పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మేల్యే గారు అన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు..పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ చేరికల వల్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు రనేష్ దేశాయి, వినోద్, మాజీ సర్పంచ్ లక్షెట్టి సాయులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love