భారతదేశపు అతిపెద్ద ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్

– కిరణ్ నాదర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ యొక్క కొత్త భవన నమూనా విడుదల చేసిన సర్ డేవిడ్ అడ్జాయే
నవతెలంగాణ- హైదరాబాద్: కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (KNMA) తమ కొత్త భవనం యొక్క నిర్మాణ నమూనాను విడుదల చేసింది. స్థానిక ఆర్కిటెక్ట్ ఆఫ్ రికార్డ్‌గా S. ఘోష్ & అసోసియేట్స్ సహకారంతో ప్రఖ్యాత ఘనాయన్-బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ డేవిడ్ అడ్జాయే రూపొందించిన ఈ భవనం , ఢిల్లీలో తమ తలుపులు 2026లో తెరిచినప్పుడు భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా అవతరిస్తుంది. న్యూ ఢిల్లీలోని ఈ భవన నిర్మాణ ప్రాంగణం వద్ద జరిగిన భూమి పూజ కార్యక్రమం లో ఈ నమూనా విడుదల చేశారు. ఈ మోడల్ కేంద్రంగా నిర్వహించిన ప్రదర్శనలో తయ్బ్ మెహతా (1925-2009), జరీనా (1937-2020) మరియు నస్రీన్ మొహమెదీ (1937-1990) ల కలెక్షన్ తో పాటుగా మ్యూజియం కలెక్షన్ ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ఉంది. దీనితో పాటు సమకాలీన చిత్రనిర్మాత అమిత్ దత్తా తీసిన Touch AIR (2023) చిత్రం కూడా ఉంది. KNMA ను 2010లో భారతదేశం మరియు ఉపఖండం నుండి ఆధునిక మరియు సమకాలీన ఆర్ట్ కలెక్టర్ లలో ఒకరిగా గుర్తింపు పొందిన కిరణ్ నాడార్ ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మార్గదర్శక ప్రైవేట్ మ్యూజియంగా గుర్తింపు పొందింది . ప్రస్తుతం దీని శాఖలు న్యూఢిల్లీ మరియు నోయిడాలో ఉన్నాయి. 100,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ప్రదేశం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జాతీయ రహదారి (NH8)పై ఉంటుంది.మ్యూజియం యొక్క 10,000 కు పైగా ఆధునిక మరియు సమకాలీన కలెక్షన్ ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక చరిత్రపై ఆధారపడింది. కొత్త KNMA సంగీతం, నృత్యం థియేటర్ కోసం అంతర్జాతీయ సంస్కృతిక.

 

Spread the love