ఇంటర్ ఫలితాలు విడుదల.. విద్యార్థిని ఆత్మహత్య..!

నవతెలంగాణ – హైదరాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అయినా లేదంటే తక్కువ మార్కులు వచ్చినా డిసప్పాయింట్ అవ్వడం మంచి విషయం కాదు. చాలా మంది విద్యార్థినిలు, విద్యార్థులు మనస్థాపం కి గురై ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఈ రోజు ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమం లో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిందని తీవ్ర మనస్థాపానికి చెంది, విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల లో ఇది చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో ఆమె మనస్తాపం చెందింది. మంచిర్యాల విద్యార్థిని తేజస్విని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వలన తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబం శోకసంద్రం లో మునిగిపోయింది

Spread the love