‘బేబీ’ సినిమా కల్ట్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు అల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ ప్రశంసలు కురిపించారు.
ఈ ఈవెంట్లో విజరు దేవరకొండ మాట్లాడుతూ, ‘సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు. వాళ్ళలో కొన్ని క్యారెక్టర్స్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్గా అటెంప్ట్ చేశాడు. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది. బేబీ మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘ఇవాళ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా గర్వపడుతున్నారని అనుకుంటా’ అని చెప్పారు.
దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, ‘ఆనంద్, విరాజ్, వైష్టవి మంచి సినిమా చేస్తున్నామని నమ్మారు. ఈ ముగ్గురు నన్ను ఓ మంచి సినిమాకు దర్శకుడిని చేశారు. ఎస్కేఎన్ నా ఫ్రెండ్ అవడం నా అదష్టం’ అని అన్నారు. ‘మా సినిమా రిలీజైన గత నాలుగు రోజులుగా హౌస్ఫుల్స్తో నడుస్తోంది. బేబీ సినిమాను కల్ట్ మూవీ అంటున్నారు. ఇలాంటి పేరు రావడం సంతోషంగా ఉంది’ అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.