మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలి

– గణపాక సుధాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలానికి నూతన మండల పరిషత్ అధికారిగా బదిలీపై వచ్చిన జవహర్ రెడ్డి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ధర్మసాగర్ మండలం నుండి మండలానికి ఎంపీడీవో గా బదిలీపై వచ్చిన జవహర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమంలో భాగంగా సి ఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నిర్వహిస్తున్నారు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు ప్రభుత్వ అధికారులుగా కృషి చేయాలని వారిని కోరారు.అంతే కాకుండా ప్రజా సమస్యలు తీర్చుటకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుతూ శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా బి సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు, చల్వాయి గ్రామ కమిటీ కార్యదర్శి కందాల వెంకన్న, సీనియర్ నాయకులు చుక్క కొమురయ్య, మండల కమిటీ మహిళా నాయకురాలు గోపిదాస్ వజ్రమ్మ, ఎండీ మజిత, ఎండీ సజనా తదితరులు పాల్గొన్నారు.

Spread the love