పిట్టల రవీందర్ కి పలువురి అభినందన

నవతెలంగాణ-వీణవంక
మత్స్య సహకార సంఘాల సమైఖ్య రాష్ట్ర చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన పిట్టల రవీందర్ ను సీఎం కేసీఆర్ ఇటీవల నియమించారు. కాగా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ ను మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, విప్, ఎంఎల్సీ పాడి కౌశిక్ రెడ్డి, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
వీణవంక నుండి భారీగా తరలిన ముదిరాజ్ కులస్తులు
వీణవంక మండల కేంద్రానికి చెందిన మత్స్య సహకార సంఘాల సమైఖ్య రాష్ట్ర చైర్మన్ పిట్టల రవీందర్ సీఎం కేసీఆర్ నియమించడంతో ముదిరాజ్ కులస్తులు ఆయన సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ కార్యక్రమానికి మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Spread the love