మేడే రోజు కార్మికులకు సెలవు దినం ప్రకటించాలి

– లేబర్‌ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులకు సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కార్మికశాఖ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 2023 మేడే సందర్భంగా కొన్ని సంస్థల యాజమాన్యాలు సెలవు ప్రకటించలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలోని పరిశ్రమలు, షాపులు, ఎస్లాబ్లిష్‌మెంట్స్‌ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, ఇతర సంస్థల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించే విధంగా యజమానులకు తగిన ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love