– సన్రైజర్స్తో ఆర్సీబీ ఢీ నేడు
హైదరాబాద్ : ఐపీఎల్ 17లో మరో భారీ స్కోర్ల మ్యాచ్కు రంగం సిద్ధమైంది. భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తలపడనుంది. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్లో ఐపీఎల్లో ఆల్టైమ్ స్కోరు రికార్డు బద్దలైంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు విధ్వంసక ఫామ్లో ఉండటం.. బెంగళూర్ బౌలర్ల నైరాశ్యంతో నేడు ఉప్పల్లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ఎడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్ మంచి ఫామ్లో ఉన్నారు. పవర్ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్రైజర్స్ నేడూ అదే వ్యూహంతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ పాట్ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ బంతితో మెరుగైన ప్రదర్శనపై కన్నేశారు. మరోవైపు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ మినహా ఆర్సీబీ శిబిరంలో ఎవరూ నిలకడగా రాణించటం లేదు. విదేశీ క్రికెటర్లు బెంగళూర్కు గుదిబండగా మారారు. మియాబారు మహ్మద్ సిరాజ్ సొంతగడ్డపై బెంగళూర్కు మెరుగైన ప్రదర్శన చేస్తాడేమో చూడాలి. సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పోరు నేడు.