నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
ఇంటర్ ఫలితాల్లో రెయిన్ బో ఇంటిగ్రేటెడ్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, విద్యార్థుల నిర్విరామ కషి , తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహము వలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కరస్పాండెంట్ ఏ శాంతి కుమార్ యాదవ్, ప్రిన్సిపల్ ప్రత్యూష కోలన్ తెలిపారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ,సీఈసీ, ఎంఈసి విభాగాలలో…
కీర్తిక సిర్వి ఎంఈసీ 958/1000, టేకుమట్ల పావని బైపీసీ 952/1000, అయేషా తస్నీమ్ ఎంఈసి 938/1000, పి అనిత బైపీసీ 920/1000, టి గౌతమి 920/1000,
సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి , సీఈసీ విభాగాలలో….
ఎన్ . లావణ్య – బైపీసీ – 430/440, ఎం అంజలి – సీఈసీ – 484 /500, వై. అక్షయ – ఎంపీసీ 435/470, జై నిఖిత – ఎంఈసి 460/500, ఖుషి – సీఈసీ -459/500, డింపల్ భటి – ఎంఈసి – 455/500, అయేషా అమ్రీన్ – సీఈసీ 454/500, షాజీయ సుల్తానా సీఈసీ 435/500 సాధించారు.
జూనియర్, సీనియర్ ఇంటర్ … ఆపైన ఎంతో మంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు. ప్రతీ విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, సూక్ష్మ ప్రణాళిక వలన ఈ ఫలితాలు కేవలం కొంతమంది విద్యార్థులకు పరిమితం కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ శాంతి కుమార్ యాదవ్, ప్రిన్సిపాల్ ప్రత్యూష కోలన్, ఉపాధ్యాయుల బందం, బోధనేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.