మంత్రి హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి

నవతెలంగాణ-నకిరేకల్‌
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీశ్‌రావును నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కలిశారు. మంత్రి హరీశ్‌రావు శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి కలిసి నకిరేకల్‌ నియోజకవర్గంలోని పలు పెండింగ్‌ పనుల గురించి వివరించారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థలో ఉన్నదని, నూతన భవనానికి నిధులు మంజూరు చేసి వంద పడకల ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌ చెయ్యాలని మంత్రిని కోరారు.

Spread the love