దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం దోహదం: ఎంపీడీవో

నవతెలంగాణ – పెద్దవంగర

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం దోహదపడుతుందని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్దవంగర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీడీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక స్తోమత కలిగిన దాతలు విరివిగా చలివేంద్రాలను ప్రారంభించాలని కోరారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంకన్న, నర్సింహా మూర్తి, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love