నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లారు. ప్రస్తుతం యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అభినంద్కుమార్ షావిలి వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ అలోక్ అరధే 2009 డిసెంబర్లో అక్కడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తున్నారు. పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా వస్తున్నారు. జస్టిస్ అలోక్ అరధే రారుపూర్లో 1964 ఏప్రిల్ 14న పుట్టారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చేశాక 1988లో లాయర్గా ఎన్రోల్ అయ్యారు. 2007లో సీనియర్ అడ్వొకేట్ హౌదా లభించింది.