నయా క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌

నయా క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌రాజ్‌ తరుణ్‌ హీరోగా, గోవిందరాజు సమర్పణలో కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌.ఎల్‌. పి ప్రొడక్షన్‌ నెం.1 సినిమా ప్రారంభ పూజ శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్‌ కడుములని పరిచయం చేస్తూ ఈ సినిమాని మురళీధర్‌ రెడ్డి, కేఐటిఎన్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు డైరెక్టర్‌ మారుతి క్లాస్‌ చేయగా, ప్రవీణ్‌ సత్తార్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నక్కిన త్రినాధరావు ఫస్ట్‌ షాట్‌కి డైరెక్ట్‌ చేయగా, ధీరజ్‌ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్‌ అందజేశారు. దర్శకుడు రమేష్‌ కడుముల మాట్లాడుతూ,’ఈ సినిమా షూటింగ్‌ ఈనెల 15న ప్రారంభమై కంటిన్యూ షూటింగ్‌ ఉంటుంది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇది క్రైమ్‌ కామెడీ. ‘స్వామిరారా, అంధధూన్‌ ‘ తరహాలో అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ‘కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్‌ కేఐటిఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ,’ఇది చాలా మంచి కథ. క్రైమ్‌ కామెడీ జోనర్‌. నా ఫేవరట్‌ జోనర్‌. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి సాలిడ్‌ కంటెంట్‌తో రాబోతున్నాం’ అని అన్నారు. హీరోయిన్‌ రాశీ సింగ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది. రాజ్‌ తరుణ్‌తో కలసి నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.

Spread the love