సాహస్, దీపికా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 పిఎమ్’. చైతు మాదాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర టీజర్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు. ‘ఏలియన్ ప్లానెట్ నుంచి మానవులు: ప్రాక్సిమా ఈవీ-12, 400 సంవత్సరాలలో భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్ టౌన్కి చేరుకుంటారు. అదే రోజున, టౌన్ని నాశనం చేయడానికి కొన్ని పరిణామాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్ను 7:11 పీఎమ్లోపు డీయాక్టివేట్ ఏం జరుగుతుందే ఉత్కంఠని టీజర్లో చూపించారు. విజువల్స్, కథనం, సాంకేతిక నైపుణ్యంలో ఒక మాస్టర్ పీస్ అన్నట్లుగా టీజర్ గొప్పగా అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర బృందం తెలిపింది.