నవ సమాజానికి నిర్మాణం కోసం నవ తెలంగాణ

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
నవ సమాజ నిర్మాణం కోసం నవ తెలంగాణ అవసరం ఎంతైనా ఉందని సిపిఐఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో నవతెలంగాణ క్యాంపియన్ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా వైద్యుడు డాక్టర్ నాగరాజు తో సంవత్సర చందా చేర్పించి మాట్లాడారు. భవిష్యత్తు సమాజ నిర్మాణం కోసం నిజాలను నిర్భయంగా రాసే నవ తెలంగాణ అవసరం సమాజానికి ఎంతో ఉందని అన్నారు. అధికారంలో ఉండి మన జీవన విధానంపై అనేక కట్టుబాట్లు విధిస్తున్న చాందసవాదాన్ని ఎదిరించి మంచి నవ సమాజాన్ని నిర్మించేందుకు నవతెలంగాణ చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొదిల్ల చిట్టిబాబు, గొంది రాజేష్, డివైఎఫ్ఐ నాయకులు సంజీవ విలేఖరి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love