నో బెయిల్‌

No bail– రాధాకిషన్‌రావు పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
– మరో ముగ్గురు అధికారుల విషయంలో 26న నిర్ణయం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు బెయిల్‌ను నాంపల్లికోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన వేసుకున్న పిటిషన్‌ను బుధవారం కోర్టు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్‌ ఇవ్వరాదంటూ కేసు దర్యాప్తు జరుపుతున్న స్పెషల్‌ టీమ్‌ న్యాయవాది చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకున్నది. కాగా, ఈ కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితులు అదనపు డీసీపీలు బుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్‌రావుల బెయిల్‌పై విచారణను ఈనెల 26 తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Spread the love