తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి

నవతెలంగాణ – భిక్కనూర్
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని భిక్కనూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ సూచించారు. వేసవికాలంలో ఈత కొట్టడానికి చెరువులు కుంటల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని, చిన్నారులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని తెలిపారు. రాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Spread the love