రేపు మండలంలో పైడాకుల అశోక్ పర్యటన

నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునీ హోదాలో పైడాకుల అశోక్ కుమార్ మంగళవారం మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ మీడియాకు సోమవారం వేలువరించారు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన వాస్తవ్యుడైన పైడాకుల అశోక్ కుమార్ తొలిసారిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో మండల కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ కమిటీల అధ్యక్షులు గోవిందరావుపేట మండల అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు అందరూ హాజరయి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా అశోక్ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తొలిసారిగా అధ్యక్షుని హోదాలో హాజరవుతున్న అశోక్ ను అపూర్వ స్వాగతంతో ఆహ్వానించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుపుతున్నారు

Spread the love