పార్టీలు మార్చడంలో పుట్ట దిట్ట

– మొసలి కన్నూరి కురుస్తున్న బిఆర్ఎస్
– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ పార్టీలు మారడంలో దిట్టని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి  మాట్లాడారు పూటకో పార్టీ మారుస్తున్న చైర్మన్ పుట్ట బిఆర్ఏస్ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అవినీతి పరుడు పిఏసిఎస్ చైర్మన్ గా ఉండడంతో అతన్ని తొలగించడానికె కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసం పెట్టడం జరిగిందన్నారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నట్లుగా తెలిపారు.రైతుల పంటలు ఎండుతున్నాయని చెప్పే బిఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల కుంభకోణం చేశారని దీంతో రైతులకు చుక్క నీరు రాలేదన్నారు.లక్ష కోట్లతో నిర్మాణం చేపట్టిన మెడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిందన్నారు.దళిత బంధు ఇస్తామని ప్రలోభాలకు గురి చేసి రాత్రికిరాత్రే బిఆర్ఏజ్ పార్టీలో కాంగ్రెస్ నాయకులను చేర్చికున్న చరిత్ర బిఆర్ఎస్ దేని విమర్శించారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, బానోతు సమ్మక్క,సగ్గేం రమేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, బొబ్బిలి రాజు గౌడ్, రాహుల్, రాగం రమేష్, మదు, ఆర్ని రాజబాబు, మహేష్ పాల్గొన్నారు.
Spread the love