చేవెళ్ల ఎంపీగా రంజిత్‌ రెడ్డి గెలుపు ఖాయం

– డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్‌ బీ అధ్యక్షుడు కర్రే భరత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్‌
– జోరుగా కాంగ్రెస్‌ ప్రచారం
నవతెలంగాణ-కుల్కచర్ల
చేవెళ్ల ఎంపీగా డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి గెలుపు ఖాయ మని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్‌ బీ అధ్యక్షుడు కర్రే భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆంజనేయులు ముది రాజ్‌ ధీమా వ్యక్తంచేశారు. శనివారం మండలం ఇప్పాయి పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో పాటు, ఇంటింటికీ తిరి గి వారు ఎంపీ రంజిత్‌ రెడ్డి బావమరిది చేన్నారెడ్డితో కలి సి ప్రచారం నిర్వహించారు. రంజిత్‌ రెడ్డి గెలుపుతోనే చేy ెళ్ల మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా యువ నాయకులు కుమ్మరి స్వామి, మం డల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, సీనియర్‌ నాయ కులు, యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love