అభ్యుదయ కాలనీలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలి..

నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర గ్రామపంచాయతీ పరిధిలోని అభ్యుదయ కాలనీలో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ములుగు జిల్లా కమిటీ కన్వీనర్ మంచాల కవిత కారం రజిత అన్నారు. మంగళవారం అభ్యుదయ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభ్యుదయ కాలనీలో నడవలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు రోడ్లపై రాళ్లు తేలి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామపంచాయతీ రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు సుమలత సులోచన సావిత్రి సునీత సుభద్ర రాధిక భాగ్యలక్ష్మి సమ్మక్క నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love