వికలాంగులకు రూ. 4016 అందాజేత..

నవతెలంగాణ – మాక్లూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ. 4016 ఈ నెల నుంచి అందిస్తున్నారని బి అర్ ఎస్ కార్యకర్తలు తెలిపారు. బుదవారం మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో లబ్ధిదారులకు పెంచిన పించన్ అందజేశారు. సిఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ప్రవీణ్, జీవన్ అన్న యూత్ అధ్యక్షులు గోపు రంజిత్, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love