మత్స్యశాఖ జిల్లా  డైరెక్టర్ శ్రీనివాస్ కె సన్మానం

నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామ మత్స్యకారుల పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గా ఇటీవల ఎన్నికైన జంగిడిపల్లికి చెందిన జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ ను సోమవారం ఎడ్లపల్లి గ్రామ సగంగము సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగిడి శ్రీనివాస్ మాట్లాడారు సంఘము పటిష్ఠతకు, అభివృద్ధికి, మత్స్యకారులకు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే పథకాలను అందేలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనరల్ సెక్రెటరీ అక్కిన వేణి అశోక్ , డైరెక్టర్లు పేరయ్య,గడ్డం శంకరయ్య, సుంకరి సురేష్, ముదిరాజ్ కుల పెద్దలు దెబ్బట నగేష్ , అక్కినేని మాంతయ్య , చనివేని లక్ష్మయ్య, సమ్మయ్య, మహేందర్, శివ సారయ్య పాల్గొన్నారు.
Spread the love